ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్పై వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. ఓ వీడియో లీక్ వ్యవహారంతో పాటు గత కొంతకాలంగా ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం ప్రధాన కార్యదర్శి ఎస్ఎ హుస్సేన్ అన్వర్ శుక్రవారం అర్థరాత్రి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా రహ్మత్ బేగ్పై పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఆయన వ్యవహారశైలి పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేత సూచనల మేరకు రహ్మత్ బేగ్పై చర్యలు తీసుకున్నట్లు హుస్సేన్ అన్వర్ తెలిపారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. తన రాజీనామా పత్రాన్ని శాసన మండలి చైర్మన్కు అందజేయాలని స్పష్టం చేశారు.
ఇటీవల ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్కు సంబంధించిన ఓ వీడియో వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా నిర్ణయంతో ఎంఐఎంలో అంతర్గతంగా చర్చ మొదలైంది.

Post a Comment