రిపోర్టర్ పై కొడవలితో దాడి... తీవ్ర గాయాలు
రిపోర్టర్ పై కొడవలితో దాడి... తీవ్ర గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఒక ప్రముఖ పత్రికకు రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ పైన మంగపేట మండలం రామచంద్ర పేటలో కొడవలితో కొందరు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అనే విషయం తెలియవలసి ఉంది.
తీవ్ర గాయాలు అయినా విజయ్ ను మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో విజయ్ కోమలి రెస్టారెంట్ ను ప్రారంభించారు.

Post a Comment