తీవ్ర విషాదం ప్రముఖ సంగీత విద్వాంసుడు మృతి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
జాకీర్ హుస్సేన్ మృతితో భారతీయ సంగీత ప్రపంచం, చలనచిత్ర రంగం, అలాగే ప్రపంచ సంగీత అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముంబైలో జన్మించిన ఆయన తన అద్భుతమైన తబలా ప్రతిభతో ప్రపంచాన్ని అలరించారు.
పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను ఆయన అందుకున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి గొప్ప గౌరవం తీసుకువచ్చిన జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.

Post a Comment