యూ ట్యూబర్ హర్షసాయిపై RTC ఎండీ సజ్జనార్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ఎండీ సజ్జనార్ ప్రముఖ యూ ట్యూబర్ హర్షసాయి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్కు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్న సజ్జనార్, హర్షసాయి తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో హర్షసాయి వీడియోను షేర్ చేస్తూ, "చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో. బుద్దుందా అసలు! వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లూయెన్సర్లను అన్ఫాలో చేయండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి" అంటూ కామెంట్ చేశారు.
ఇటీవల ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుష్పరిణామాలను కలిగిస్తున్న నేపథ్యంలో, పలువురు అధికారులు, సామాజిక సేవకులు ఈ తరహా ప్రమోషన్లను తీవ్రంగా ఖండిస్తున్నారు. RTC ఎండీగా ఉన్న సజ్జనార్ నేర సమూల నిర్మూలన, సమాజ హితానికి సంబంధించి కఠినమైన వైఖరిని అనుసరించే వ్యక్తిగా పేరు పొందారు.
ఈ ట్వీట్కు నెటిజన్లు భిన్నమైన ప్రతిస్పందనలను ఇస్తున్నారు. కొందరు సజ్జనార్ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు హర్షసాయిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం సరైనదికాదని అభిప్రాయపడుతున్నారు.

Post a Comment