నేరేడు పండ్లు తింటే షుగర్ దూరం: నిపుణుల సూచనలు
ఆరోగ్యానికి సహజంగా మేలు చేసే ఫలాల్లో నేరేడు (జామున్) పండ్లు ముఖ్యమైనవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని నేరేడు పండ్లు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
నిపుణుల ప్రకారం, నేరేడు పండ్లు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగపడతాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే "జాంబోలిన్" అనే యాక్టివ్ కాంపౌండ్, శరీరంలో చక్కెర శోషణను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
అంతేకాకుండా, నేరేడు పండ్లలో విటమిన్ సి ప్రాముఖ్యంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, మెదడు క్రియాశీలతను ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అలాగే, అధిక బరువు సమస్య ఉన్నవారికి ఇది సహజమైన పరిష్కారం. నేరేడు పండ్లు తినడం ద్వారా ఆకలి నియంత్రితంగా ఉండి, బరువు పెరగకుండా చూసుకోవచ్చు.
అయితే, నిపుణులు హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే — నేరేడు పండ్లను అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం కావొచ్చు. ముఖ్యంగా ఎక్కువగా తినడం వల్ల జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. కొన్నిసార్లు శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా కలగవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కనుక మితంగా, నియమితంగా మాత్రమే వీటిని తీసుకోవాలని వారిఅభిప్రాయం.
మొత్తంగా చూస్తే, నేరేడు పండ్లు ఒక ఆరోగ్య రక్షక ఫలం. అయితే మితమైన మోతాదులో తీసుకుంటేనే శ్రేయస్కరం.
Post a Comment