స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు ప్రభుత్వంనకు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రజాస్వామ్యానికి నాంది పలికే గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. వచ్చే సెప్టెంబర్ 30 లోగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
🔹 ఆరు పిటిషన్లపై విచారణ – తీర్పు రిజర్వ్
పల్లె ప్రజలకు ప్రాతినిధ్యం కలిగించే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిబంధనల ప్రకారం జరపాలని కోరుతూ దాఖలైన ఆరు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. జూన్ 23న ఇరు వాదనలు విన్న న్యాయస్థానం, తీర్పును రిజర్వ్ చేసి, జూన్ 25న న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవీ దేవి ఈ తీర్పును వెల్లడించారు.
🔹 ప్రభుత్వం, ఈసీ వాదనలు:
- బీసీ రిజర్వేషన్ల సర్దుబాటు కారణంగా ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
- పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కనీసం 30 రోజులు గడువు ఇవ్వాలని కోరింది.
- ఇదే సమయంలో 60 రోజులు కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) వాదించింది.
🔹 హైకోర్టు ఆదేశాలు:
- 2025, సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు పూర్తిచేయాలి.
- 30 రోజుల్లోగా వార్డుల విభజన పూర్తి చేయాలి.
- ప్రజాప్రతినిధులు లేక ప్రజల ద్రోహంగా వ్యవహరించరాదని హైకోర్టు సూచన.
🔹 15 నెలలుగా ఎన్నికల లేని పాలన:
తెలంగాణలో సర్పంచుల పదవి 2024 జనవరి 31న ముగిసింది. అప్పటి నుంచి 15 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. ప్రజాప్రతినిధుల లేని పాలనతో గ్రామాల అభివృద్ధి ఆగిపోయిందని పిటిషనర్లు న్యాయస్థానానికి వివరించారు.
🔹 ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం:
హైకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు నాంది పలికినట్లయింది. ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఎన్నికల నిర్వహణకు మరింత జాప్యం జరిగితే, న్యాయ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Post a Comment