కొత్తగూడెంలో మున్సిపల్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పారిశుద్ధ్య మెరుగుదల, దోమల నివారణపై డిమాండు
కొత్తగూడెం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట విస్తృత నిరసన ధర్నా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాలు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు జరిగిన ఈ ధర్నాకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా సీతాలక్ష్మి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలనీ, పారదర్శకత పాటించాలని కోరారు.
పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్రంగా దిగజారినట్లు ఆరోపణలు చేస్తూ, కార్పొరేషన్ పరిధిలో తక్షణమే మట్టికూడిన డ్రైనేజీలను శుభ్రం చేయాలని, దోమల నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని కోరారు. వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ పథకం కింద తవ్విన గుంటల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు.
ధర్నా అనంతరం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, పల్లపు రాజు, మైనారిటీ సెల్ నాయకులు ఖాజా భక్ష్, మునీర్, హుస్సేన్, ఎస్సీ సెల్ రామిళ్ళ మధు, ఎస్టీ సెల్ నాయకులు పూర్ణచందర్, అజ్మీరా విజయ్, రాజ మల్లయ్య, షమ్మీ, మొయినుద్దీన్, సూరి, అశోక్, నగేష్, బాబు జానీ, నాగరాజు, మజీద్, అన్వర్ ఖాజా, తుంగ కనకయ్య, ఆర్. శ్రీనివాస్, శ్రీదేవి, శైలజ, కోమల, శ్రీనిజ, సుందర్ పాసి, టింకు, సోనీ పాసి, సౌజన్య, ఆశ, మాధవి, స్వర్ణ, లక్ష్మి, కమల, విజయ, జి విజయ, సుహాని, మహేశ్వరి, రమణ, శ్రావణ్, నసీమా, మహబూబ్, షేక్ బాజీ, షేక్ బిబి, సత్యవతి, ఖంరున్నిసా, షణ్ముఖ, సిద్దు, బన్ను, అమన్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment