సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కోర్టులో విజయం.. కొత్తగూడెం మైనారిటీల హర్షాతిరేకం!
కొత్తగూడెం: ఈరోజు పండుగ దినంలా మారింది. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ప్రియతమ నాయకుడు, పేద ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తున్న ప్రజా సేవకుడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు న్యాయ పోరాటంలో విజయాన్ని సాధించారు.
మాజి ఎమ్మెల్యే వెంకటరావు ఆయనపై దాఖలు చేసిన ఎలక్షన్ కేసును కోర్టు పూర్తిగా కొట్టివేయడం సంబరాలకు దారితీసింది. ఈ సందర్భంగా కొత్తగూడెం మైనారిటీ సంఘాల సభ్యులు ఆహ్లాదంతో స్వీట్లు పంచుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు మొహమ్మద్ యూసుఫ్, అబిద్ హుస్సేన్, అమీర్ ఖాద్రి, గౌస్ తదితరులు పాల్గొని కూనంనేని సాంబశివరావు గారికి తమ మద్దతును ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో న్యాయం విజయం సాధించిందని, ఈ తీర్పు నిజమైన ప్రజానాయకుడికి సముచిత గౌరవం అని వారు అభిప్రాయపడ్డారు.
కేసు కొట్టివేతతో రాజకీయంగా శక్తివంతమైన సందేశం వెళ్ళిందని పలువురు స్థానిక నాయకులు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుతో కూనంనేని సాంబశివరావు గారి ప్రజాప్రియతకు మళ్ళీ ముద్ర పడిందని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మైనారిటీ వర్గాలు తన నాయకుడిపై గల విశ్వాసాన్ని మరోసారి నిరూపించాయి. ప్రజాస్వామ్యం అంటే న్యాయం, ప్రజాస్వామ్యంలో నిబద్ధత అంటే సాంబశివరావు గారిలాంటి నాయకులే అని ఈ వేడుకల ద్వారా స్పష్టమైంది.
Post a Comment