శ్రీశైలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా
హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి మల్లన్న దర్శనార్థం బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు దోమలపెంట సమీపంలో బోల్తా పడింది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం మేరకు.. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్కు వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు రోడ్డుపక్కకు ఒరిగి బోల్తా పడింది. బస్సులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ఇటువంటి ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, కొందరిని చికిత్స కోసం సమీప దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Post a Comment