తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం — బీసీలకు 42% రిజర్వేషన్
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ హర్షిస్తూ, ఇది ఒక సామాజిక విప్లవానికి నాంది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెంపుదలైన రిజర్వేషన్లను అమలు చేయాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈరోజు జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 2018 నాటి చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని స్వాగతించారు.
"జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి" అన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ను దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు చేయడం పట్ల గర్వంగా ఉందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ చారిత్రాత్మక నిర్ణయం కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు మంత్రివర్గ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
"తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి" అంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Post a Comment