ఇంజినీర్ ఇన్ చీఫ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ACB అరెస్ట్..!
తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్ శాఖకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ వీరవల్లి కనకరత్నం లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని బదిలీ మరియు కొత్త పోస్టింగ్ కోసం రూ.50,000/- లంచం డిమాండ్ చేసిన ఈ అధికారి, డబ్బు తీసుకునే సమయంలో అవినీతి శాఖ అధికారుల ఉచ్చులో చిక్కుకున్నారు.
ఈ సంఘటన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొనసాగుతున్న అవినీతి స్వరూపాన్ని మరోసారి బయటపెట్టింది. బాధితుని ఫిర్యాదుతో ముందస్తు పథకంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన ACB అధికారులు, నిశితంగా పర్యవేక్షించి, తనిఖీల అనంతరం కానకరత్నంను అదుపులోకి తీసుకున్నారు.
ప్రజలకు సూచన:
తెలంగాణలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే, వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖను సంప్రదించగలరు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్: 1064 కు డయల్ చేయండి.
అంతేకాకుండా, అనేక సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు:
గమనిక: ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణకు అవినీతిపై నిరంతర పోరాటం సాగించేందుకు అందరూ ముందుకు రావాలి.
Post a Comment