కూతురిపై అత్యాచారం… తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష
నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటనలో తల్లికే 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కేసు వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి — నల్గొండకు చెందిన యాదమ్మ గ్యారాల శివకుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే శివకుమార్, యాదమ్మ సహకారంతో ఆమె మైనర్ కూతురిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణంపై 2023లో నల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
విచారణ అనంతరం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. రెండో నిందితురాలైన యాదమ్మకు 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఈ తీర్పు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Post a Comment