లంచం తీసుకుంటూ ఏసీబి చేతికి చిక్కిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ అసిస్టెంట్
మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్చార్జ్ మరియు అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జూనియర్ అసిస్టెంట్ గడియారం శ్రీనివాసులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) చేతికి చిక్కారు.
వివరాల్లోకి వెళ్తే – ఫిర్యాదుదారునికి సంబంధించిన బకాయి కరువు భత్యపు రెండు బిల్లులను సిద్ధం చేసి, వాటిని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డి.డి.ఒ. గారికి సమర్పించేందుకు నిందితుడు రూ. 6,000/- లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ACB అధికారులు నిందితుడిని రంగేబెళ్లో పట్టుకున్నారు.
టెలంగానా అవినీతి నిరోధక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది: ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం కోరితే, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేయాలని, అలాగే WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X (@TelanganaACB), Website (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని శాఖ హామీ ఇచ్చింది.
Post a Comment