ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ద్వారకా సెక్టార్-7లోని ఒక పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు ప్రారంభించారు.
ఇటీవలి రోజుల్లో ఢిల్లీలోని పలు పాఠశాలలకు వరుసగా ఇలాంటి ఇ-మెయిల్ బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇవి తప్పుడు అలారంలుగానే తేలినా, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు మాత్రం ప్రతి సమాచారం పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
👉 భద్రతా చర్యల భాగంగా స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Post a Comment