హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష, జరిమానా
కొత్తగూడెం లీగల్, హత్యాయత్నం కేసులో నలుగురికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం ఫస్ట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే. కిరణ్కుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.
గ్రామస్తులు భూఖ్య బాలాజీ, భూక్య జక్రి, బాధావతు బాలకృష్ణ, దారావత్ సురేష్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారని విచారణలో తేలింది. గాయపడిన వారిని వెంటనే బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం కోర్టుకు చార్జ్షీట్ సమర్పించారు.
ఈ కేసులో సున్నం అజయ్ మైనర్ కావడంతో అతనిపై వేరుగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాగా, మరో నిందితుడు సున్నం చెంచయ్య విచారణలో ఉండగానే మరణించడంతో అతనిపై కేసు మూసివేశారు.
ఈ కేసు ప్రాసిక్యూషన్ను ఏపీపీ కె. రాజారావు నిర్వహించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, డ్యూటీ ఆఫీసర్ పిసి జే. సురేష్ సహకరించారు.
Post a Comment