టీటీడీకి రూ.10.51 లక్షల విరాళం సాయి సిద్ధార్థ్ ఎంటర్పైజర్స్
తిరుమల, ఫిబ్రవరి 03, హైదరాబాద్కు చెందిన సాయి సిద్ధార్థ్ ఎంటర్పైజర్స్ సంస్థ సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు రూ.10.51 లక్షలు విరాళంగా అందించింది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడును కలిసి విరాళం డీడీని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment