-->

21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన భారత వాతావరణ శాఖ

21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన భారత వాతావరణ శాఖ రుతువుల మార్పిడితో కురిసే అవకాశం


హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా 22వ తేదీన ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది.

ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టినా, ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశమున్నట్లు హెచ్చరించింది. పలు చోట్ల వడగండ్ల వర్షం పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని, ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

నెలాఖరు వరకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793