కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్కు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు వీహెచ్కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అస్వస్థతకు గల ఖచ్చితమైన కారణాలపై వైద్యులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment