సింగరేణి బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు: హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
సింగరేణి బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు: హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్
గోదావరిఖని, జూన్ 21: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన “సింగరేణి బాయిబాట” కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగరేణి కార్మికులు, హెచ్ఎంఎస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, అభిమానులకు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను పరిరక్షించడం, కార్మికుల హక్కులను కాపాడడం, సంస్థ భవిష్యత్తుపై ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని పేర్కొన్నారు. పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన కార్మికులు విశేష స్పందన చూపడం కార్యక్రమం విజయానికి నిదర్శనమన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలు, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ కార్యక్రమం ద్వారా బలమైన సందేశం వెళ్లిందని రియాజ్ అహ్మద్ తెలిపారు. కార్మికుల ఐక్యత, సంఘీభావం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా హెచ్ఎంఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అందించిన సహకారం అమూల్యమని కొనియాడారు. కార్యక్రమం నిర్వహణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగుతాయని, కార్మికుల హక్కుల సాధన కోసం హెచ్ఎంఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని రియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్మికుడికి, నాయకుడికి, అభిమానికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, సింగరేణి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Post a Comment