వీబీ-జీరామ్ జీ (VB-GRAMG) పథకం నేటి నుంచి అమలు.. గ్రామీణ కార్మికులకు రోజుకు కనీసం రూ.300 వేతనం
వీబీ-జీరామ్ జీ (VB-GRAMG) పథకం నేటి నుంచి అమలు.. గ్రామీణ కార్మికులకు రోజుకు కనీసం రూ.300 వేతనం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (VB-GRAMG) పథకం బుధవారం (జూలై 1) నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం పాత MGNREGA స్థానంలో అమలులోకి వచ్చి, గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, ఆదాయ భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
పథకంలోని ముఖ్యాంశాలు:
- గ్రామీణ కార్మికులకు రోజువారీ కనీస వేతనం రూ.300గా నిర్ణయం.
- దేశవ్యాప్తంగా సగటు రోజువారీ వేతనం రూ.299 నుంచి సుమారు రూ.327కు పెంపు.
- ఒక్కో కార్మికుడికి రోజుకు సగటున రూ.28 అదనపు ఆదాయం లభించనుంది.
- ఉపాధి హామీ 100 రోజుల నుంచి 125 రోజులకు పెంపు.
- ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వేతనాలు 15–25 శాతం వరకు పెరిగాయి.
- ఇప్పటికే అధిక వేతనాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా సవరణలు చేశారు. హర్యానా – రూ.409, గోవా – రూ.406, కేరళ – రూ.401 రోజువారీ వేతనంగా నిర్ణయించారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొత్త వేతనాలను ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచిక (CPI) తదితర ఆర్థిక ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు స్థానిక మార్కెట్లలో డిమాండ్ను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment