-->

మలక్ పేట పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్

మలక్ పేట పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్

మలక్‌పేట పోలీస్ స్టేషన వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గిరిజన యువతి ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్‌లో ఓ ఆఫీస్ లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య (20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో అదే ఆఫీస్ లో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతి శ్రావ్యది ఆత్మహత్య కాదు హత్య అని కుటుంబసభ్యులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. 

ఈ సందర్భంగా శ్రావ్యను హత్య చేసి ఉరి వేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు నిరసనను కొనసాగిస్తామని ఆందోళన కారులు చెప్పడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.