-->

ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

 

ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ముగ్గురు బీసీ మహిళలకు కీలక పదవులు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ ప్రభుత్వం కీలక నామినేటెడ్‌ పదవుల్లో ముగ్గురు బీసీ మహిళలకు అవకాశం కల్పించింది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాన్ని ఇస్తూ ప్రభుత్వం గద్వాల విజయలక్ష్మి, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలను కీలక పదవుల్లో నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా విజయలక్ష్మి

జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వం నియమించింది. ఆమెకు కేబినెట్‌ హోదా కల్పించింది. గతంలో ఈ పదవిలో ఉన్న చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో ఏర్పడిన ఖాళీని విజయలక్ష్మితో భర్తీ చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కే. కేశవరావు కుమార్తె అయిన విజయలక్ష్మి.. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద

గద్వాల విజయలక్ష్మి రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన నేరెళ్ల శారదతో భర్తీ చేశారు. మహిళా హక్కులు, సంక్షేమం, రక్షణకు సంబంధించిన అంశాల్లో మహిళా కమిషన్‌ కీలక పాత్ర పోషించే నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.

కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి

వరంగల్‌ ప్రాంత అభివృద్ధిలో కీలకమైన కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ, వరంగల్‌ మాజీ మేయర్‌ గుండు సుధారాణి నియమితులయ్యారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఈ కీలక బాధ్యత అప్పగించారు.

మొత్తంగా ముగ్గురు బీసీ మహిళా నాయకురాళ్లకు కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వం బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశాన్ని ఇచ్చినట్లయింది. ఈ నియామకాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Blogger ఆధారితం.