-->

మహిళా సఖి బస్ డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే

  

మహిళా సఖి బస్ డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే

న్యూ ఢిల్లీ : దేశంలోనే మొట్టమొదటి  మహిళా బస్ డిపో ప్రారంభమైంది. ఢిల్లీలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ దీన్ని ఈరోజు ప్రారంభించారు. 

సరోజిని నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ డిపోలో పూర్తి  స్థాయిలో మహిళ సిబ్బంది పనిచేయనున్నారు. ఈ డిపోకు సఖి డిపో అనే పేరు కూడా పెట్టారు. 

డిపో మెనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అందరూ కూడా మహిళలే. ఇందుకోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని పేర్కొన్నారు. 

అయితే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో కూడా తమ హక్కులను పొందాలనే ఆలోచనతోనే ఈ డిపోను ప్రారంభించామని మంత్రి తెలిపారు..

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793