పంజాబ్ రాష్ట్రంలో తెలుగు భాష బోధనకు ప్రారంభం – విద్యాశాఖ వినూత్న నిర్ణయం
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భాషల పరస్పర అవగాహనను పెంపొందించేందుకు చేపట్టిన ఈ చర్యలో భాగంగా, పంజాబ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషను బోధించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ నిర్ణయం ప్రకారం, ఈ నెల మే 26 నుంచి జూన్ 5 వరకు పంజాబ్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి.
విద్యార్థుల్లో కొత్త భారతీయ భాషలపై అవగాహనను పెంపొందించేందుకు, ముఖ్యంగా తెలుగు భాషపై ప్రాథమిక సంభాషణా నైపుణ్యాలను అలవర్చేందుకు ఈ తరగతులు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజించి, వారికి మూడు గంటలపాటు తెలుగు భాష బోధించాలన్న సూచనలను విద్యాశాఖ అందజేసింది.
DTF ప్రకారం, పంజాబ్ రాష్ట్రంలో పంజాబీ భాషే విద్యార్థుల మాతృభాష. అయితే, తాజాగా జరిగిన పరీక్షల్లో 12వ తరగతిలో 3,800 మందికి పైగా విద్యార్థులు మరియు 10వ తరగతిలో 1571 మంది విద్యార్థులు జనరల్ పంజాబీ భాషలో తొలి భాషగా ఉత్తీర్ణులు కాలేదని వివరించింది.
ఈ పరిస్థితుల్లో విద్యార్థులపై భాషా భారం పెంచడం మంచిది కాదని DTF అభిప్రాయపడుతోంది. మూడు భాషల విధానాన్ని పక్కనబెట్టి, తెలుగును నాలుగో భాషగా ప్రవేశపెట్టే ప్రయత్నం సముచితమికాదని విమర్శించింది.
పంజాబ్లో తెలుగు బోధన ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.
Post a Comment