విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రాణం తీసింది – బైక్పై వెళ్తున్న కుటుంబాన్ని చంపిన తీగ
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో శనివారం మధ్యాహ్నం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈదురుగాలులతో క్షణాల్లో ఏర్పడిన ప్రమాదం ఒక కుటుంబాన్ని కూల్చేసింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మరొకసారి నిర్దాక్షిణ్యంగా జీవితాన్ని బలిగొంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి – నాగారం ప్రాంతానికి చెందిన దంపతులు సురేష్, మౌనిక తమ మూడేళ్ల బాబు శ్రేయాస్తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఆకస్మాత్తుగా ప్రారంభమైన గాలివానతో ఒక విద్యుత్ తీగ తెగిపోయి వారి బైక్పై పడింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మౌనికకు గాయాలు తీవ్రమైనవిగా మారడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. సురేష్, చిన్నారి శ్రేయాస్ల పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత తీగలు మార్పు చేయడంలో విద్యుత్ శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, కొన్ని తీగలు ఇప్పటికే శీఘ్రంగా పాడైపోతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పీడిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరణించిన మౌనిక కుటుంబాన్ని ఓదార్చడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇది హెచ్చరికగా తీసుకొని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, సంబంధిత శాఖలు తక్షణమే చర్యలు చేపట్టాలి.
Post a Comment