ఎన్సీసీ క్యాంప్లో భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు
వరంగల్: ఎనిమిదవ గర్ల్స్ బెటాలియన్ తెలంగాణ, వరంగల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 23 వరకు పిటిసి మామునూరులో నిర్వహించబడిన ఎన్సీసీ క్యాంపులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్థులు తమ ప్రతిభతో మెరిశారు.
ఈ క్యాంపులో జరిగిన వివిధ పోటీల్లో విద్యార్థులు అనేక బహుమతులు అందుకున్నారు. ఎన్సీసీ డ్రిల్ టెస్ట్లో బాలుర విభాగంలో అకీల్ అహ్మద్ మొదటి బహుమతిని గెలుచుకోగా, అమ్మాయిల విభాగంలో సాయి ప్రియ విజేతగా నిలిచింది. ఫైరింగ్ పోటీలో సంజయ్ మొదటి బహుమతి, అకీల్ అహ్మద్ రెండవ బహుమతిని సాధించారు.
క్విజ్ పోటీలో జ్ఞానేశ్వర్ అండ్ టీమ్ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. 800 మీటర్ల పరుగు పందెంలో తేజేంద్ర మొదటి స్థానం సాధించగా, సాయి ఈశ్వర్ లిఖిత్ రెండవ బహుమతిని గెలుచుకున్నాడు. 200 మీటర్ల పరుగులో తేజేంద్ర మరోసారి తన ప్రతిభను చాటగా, మురళీ కృష్ణ రెండవ స్థానం పొందాడు.
ఇంతేకాక, గాడ్ ఆఫ్ హానర్ విభాగంలోని స్పెషల్ అప్పిరియన్స్ కేటగిరీలో మాధవ్, కార్తీక్ మంచి ప్రదర్శనతో విజయాన్ని సాధించారు.
ఈ విజయాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర చారి ప్రత్యేకంగా స్పందించారు. విజేత విద్యార్థులను అభినందిస్తూ, "ఈ విద్యార్థులు తమ పాఠశాల కీర్తిని పెంచి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు," అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ, NCC అధికారి వీరు నాయక్ విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
Post a Comment