కట్న వేధింపులకు బలి అయిన ఇద్దరు స్నేహితురాళ్లు
తెలంగాణలోని రెండు జిల్లాల్లో కట్న వేధింపుల కారణంగా ఇద్దరు యువ వివాహితలు ఆత్మహత్యకు పాల్పడిన దురదృష్టకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే రోజు పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఇద్దరు స్నేహితురాళ్లు చివరికి మృతి చెందారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పరిధిలోని ప్రగతి నగర్కు చెందిన అనూష (27) స్నేహితులు. ఇద్దరూ కలసి అదే ప్రాంతంలోని ఓ డెయిరీలో పనిచేస్తూ కుటుంబ పోషణకు తోడ్పడుతున్నారు.
మమతకు రాజమల్లు, అనూషకు రమేశ్ అనే వ్యక్తులతో వివాహం జరిగింది. అయితే, వీరి వివాహ జీవితం ఆనందంగా సాగలేదు. భర్తలు ఇద్దరూ వివాహేతర సంబంధాల పట్ల మొగ్గుచూపడమే కాకుండా, తమ భార్యల్ని అదనపు కట్నం కోసం మానసికంగా వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ వేధింపులకు భరించలేక, జూన్ 23వ తేదీన మమత మరియు అనూష వేర్వేరు చోట్ల పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక బుధవారం (జూన్ 25) ఇద్దరూ మృతి చెందారు.
Post a Comment