రైల్వే ట్రాక్పై యువతి హల్చల్… శంకర్పల్లి సమీపంలో హంగామా
రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి సమీపంలో శనివారం ఉదయం అనూహ్య ఘటన కలకలం రేపింది. ఓ యువతి నేరుగా రైల్వే ట్రాక్ పైకి కారు తీసుకెళ్లి హంగామా చేసింది. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, గేట్ నంబర్ 20 వద్ద నాగులపల్లి నుంచి శంకర్పల్లి వైపు వెళ్లే దారిలో రైల్వే ట్రాక్పై యువతి కారు నడిపుతూ కనిపించింది. దాన్ని చూసిన స్థానికులు వెంటనే దూసుకెళ్లి ఆపేందుకు ప్రయత్నించగా, ఆమె చాకు (కత్తి)తో బెదిరించినట్లు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారును ట్రాక్ నుండి బయటకు తీశారు. అనంతరం యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఎలాంటి ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడిందన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం, యువతి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆమె మానసిక స్థితి కూడా అనుమానంగా భావిస్తున్నారు.
🔍 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Post a Comment