-->

మంత్రి వర్గంలో సామాజిక న్యాయం పాటించిన సీఎంకు మాల మహానాడు ధన్యవాదాలు

మంత్రి వర్గంలో సామాజిక న్యాయం పాటించిన సీఎంకు మాల మహానాడు ధన్యవాదాలు


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సామాజిక న్యాయం పట్ల చూపిన కట్టుబాటుకు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి ఎస్సీ వర్గం నుంచి, అడ్లూరి లక్ష్మణ్ గారికి బీసీ వర్గం నుంచి, వాకిటి శ్రీహరి గారికి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని మాల మహానాడు ప్రశంసించింది. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన డాక్టర్ రామచంద్రనాయక్ గారిని అసెంబ్లీ ఉపసభాపతిగా నియమించడం కూడా హర్షణీయం అని అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ –
"తెలంగాణలో సామాజిక సమతా స్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమైనవి. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూసే విధంగా మంత్రివర్గాన్ని రూపుదిద్దిన సీఎం గారికి, అలాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం," అని పేర్కొన్నారు.

ఇక మాల మహానాడు రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖ నాయకులలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిడ్ల పరంజ్యోతి రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి మేకతోటి కాంతయ్య, మంచాల వెంకటస్వామి, ముల్లగిరి కాంతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంతేటి వీరభద్రం, బేగారీ శివరాజ్, రాష్ట్ర కార్యదర్శులు దాసరి దేవయ్య, జాతీయ సభ్యులు బండి అశోక్, ముండ్లగిరి కాంతయ్య తదితరులు ఉన్నారు.

అలాగే వివిధ జిల్లాల మాల మహానాడు ప్రతినిధులు — బోయిల అఖిల్, బండ వరప్రసాదరావు, పల్ల రాజశేఖర్, దండు రాజు, పాశం వెంకటేశ్వర్లు, గాలయ్య సామరాజు, కట్ట దుర్గాప్రసాద్, సంద యాదయ్య, ఏడిండ్ల అశోక్, పిడతల శ్రీను, కంచర దాసు, ఆనందరావు, కామర్ల జానయ్య, మన్నె కృష్ణయ్య, దొంత సత్యం తదితరులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.

 

Blogger ఆధారితం.