చదువు జీవితాన్ని వెలిగించే దీపం డి.ఎస్.పి అబ్దుల్ రహమాన్
- గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు
- విశ్రాంత ఉద్యోగుల ప్రోత్సాహం మరువలేనిది
కొత్తగూడెం పట్టణంలో గల జిల్లా గ్రంధాలయం నందు సీనియర్ సిటిజన్స్ విద్యానగర్ కాలనీ వారి ఆధ్వర్యంలో పదివేల రూపాయలు విలువ చేసే సాధారణ వేడి, చల్లని, త్రాగునీరు అందించే వాటర్ కూలర్ ను జిల్లా గ్రంథాలయానికి డి.ఎస్.పి ఆర్ఎస్ రెహమాన్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ చదువు జీవితాలనివెలిగించే చక్కటి దీపం అని, సామాన్య కుటుంబాన్ని సంపన్న కుటుంబంగా తీర్చిదిద్దుతుందని ఆయన అంటూ కష్టపడి, ఇబ్బందులను ఓర్చుకుని మంచిగా చదువుకున్న వారు నేడు ఉన్నత స్థానాల్లో నిలిచారని చెప్పారు. నేటి రోజుల్లో చదువుకునేందుకు ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయని, కనీస మౌలిక సదుపాయాలు లేని రోజుల్లో వీధి దీపాలు కిరోసిన్ లాంతర్ల ముందు కూర్చుని చదువులు సాగించారని చెప్పుకొచ్చారు.
విద్యార్థులు ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదివిన నాడు లక్ష్యం సహకారం అవుతుంది, కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలు వంటివనీ, వాటిని సద్వినియోగం చేసుకొని మంచి వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తుందని మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. విశ్రాంత ఉద్యోగులు తమకు వచ్చే నెలవారి పింఛన్లులో మంచి సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయాల్లో ఉన్న అవసరాలను గుర్తించి వాటిని సమకూర్చేందుకు ముందుకు రావడం గర్వకారణం అన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బ్రతుకులను బంగారు మయంగా మలుచుకోవాలని, మన ప్రవర్తన ఆధారంగానే జీవితాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు జి మణి మృదుల సీనియర్ సిటిజెన్ సభ్యులు ప్రెసిడెంట్ కోట్ల నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్ కుమార్ ట్రెజరర్ ధర్మరాజు, కేశవరావు విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post a Comment