దారుణం.. కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కుమారుడు
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా ఉన్న హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సంగెం మండలానికి చెందిన కుంటపల్లి గ్రామంలో ఓ కుమారుడు కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హేయమైన చర్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో వినోద తీవ్రంగా కాలిపోవడంతో తక్షణమే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఘటన అనంతరం సతీష్ పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. కన్నతల్లిపై ఇంతటి క్రూర చర్యకు పాల్పడిన కుమారుడిపై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు పూర్తి విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Post a Comment