బాత్రూంలో ట్రిమ్మర్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి
జగిత్యాల జిల్లా – ఎండపల్లి మండలంలోని ముంజంపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ముంజంపల్లికి చెందిన బొమ్మగాని తిరుపతి (32) అనే వ్యక్తి ఉపాధిహామీ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడు ఆదివారం ఉదయం తన ఇంట్లోని బాత్రూంలో ట్రిమ్మర్కు ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదం జరిగింది.
ప్రాథమిక సమాచారం మేరకు, ట్రిమ్మర్కు విద్యుత్ సరఫరా జరిగే సమయంలో అది షార్ట్సర్క్యూట్కు గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీని ప్రభావంతో తిరుపతి ఒక్కసారిగా కిందపడిపోయాడు. అతడి కుటుంబసభ్యులు వెంటనే స్పందించి ధర్మారం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే తిరుపతి మృతిచెందినట్లు ప్రకటించారు.
తిరుపతికి భార్య రేణుక, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన అనుకోని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై బసంత్నగర్ ఎస్సై స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుదుర్గటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Post a Comment