హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యువతి ఆత్మహత్య
హైదరాబాద్, నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన యువతి సుష్మ (27) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అంజయ్య మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో ఉన్న పోలీసులు అదే రోజు ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువు నీటిలో ఓ మృతదేహం తేలుతూ ఉందని సమాచారం అందుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. అది సుష్మదిగా గుర్తించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలో సుష్మ వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలున్నాయా? లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Post a Comment