ద్విచక్ర వాహనాలతో రెండు హెల్మెట్లు తప్పనిసరి…!!
న్యూఢిల్లీ, దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మోటార్ వాహనాల నిబంధనలలో రెండు ముఖ్యమైన సవరణలతో కూడిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం, కొత్తగా తయారయ్యే ప్రతి ద్విచక్ర వాహనంతో పాటు ఒకటి కాదు, ఏకంగా రెండు హెల్మెట్లు తప్పనిసరిగా సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఈ హెల్మెట్లు భారత ప్రమాణాల సంస్థ (ISI) ప్రమాణాలతో ఉండాలి. వాహన తయారీదారులే కొనుగోలుదారులకు ఈ హెల్మెట్లను అందించాలి. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడో నెల నుంచి ఈ ఆదేశాలు బలవంతంగా అమలవుతాయి.
ఇక త్రిచక్ర వాహనాలపై కూడా కీలక మార్పు తీసుకొచ్చారు. వచ్చే సంవత్సరం 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాల్లో ‘యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం’ (Anti-lock Braking System - ABS) అమర్చాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ ISI 14664:2010 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.
ఈ రెండు సవరణలపై ప్రజలు, నిపుణులు, వాహన తయారీదారులు తమ అభిప్రాయాలు, సూచనలు పంపవచ్చని కేంద్ర రహదారి, రవాణా శాఖ పేర్కొంది. ఈ మేరకు 30 రోజుల్లోపు అభిప్రాయాలను comments-morth@gov.in అనే మెయిల్ ఐడీకి పంపాలని సూచించింది.
ప్రమాద నివారణకు దోహదపడే ఈ చర్యలు రవాణా భద్రతలో నూతన మైలురాయి కావొచ్చని నిపుణుల అభిప్రాయం.
Post a Comment