-->

పాల్వంచ ‘నవ మహిళా సాధికార కేంద్రం’లో మహిళలకు చెక్కుల పంపిణీ

 

పాల్వంచ ‘నవ మహిళా సాధికార కేంద్రం’లో మహిళలకు చెక్కుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ లిమిటెడ్ చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ‘నవ మహిళా సాధికార కేంద్రం’ లో మహిళలు తయారు చేసిన కళాకృతులు వారికి ఆదాయాన్ని తీసుకువచ్చాయి. ఈ కేంద్రంలో తాటి ఆకులతో రూపొందించిన కళాకృతులు, అలాగే నవ లిమిటెడ్ ఉద్యోగులకు అవసరమైన యూనిఫామ్‌లను కుట్టి విక్రయించడం ద్వారా మొత్తం రూ. 2,59,690/- ఆదాయం లభించింది.

ఈ నగదును చెక్కుల రూపంలో మహిళలకు అందజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నవ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ దేవినేని, తెలంగాణ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ రియర్ అడ్మిరల్ శరత్ బాబు, సిఎస్‌ఆర్ జనరల్ మేనేజర్ ఎంజిఎం ప్రసాద్ లు మహిళలకు చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ —

“మహిళా సాధికారత దిశగా చేపట్టిన ఈ ప్రయత్నం మంచి ఫలితాలిస్తోందని చూస్తుంటే గర్వంగా ఉంది. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిలో ముందుకు రావడానికి ఈ కేంద్రం ఒక దారిగా మారుతోంది,” అన్నారు.

కళాకృతుల తయారీతో పాటు మహిళలకు కుట్టు, డిజైనింగ్ వంటి నైపుణ్యాలను నేర్పించడం ద్వారా స్వయం ఉపాధికి అవకాశం కల్పించడం ఇదే కేంద్ర ప్రధాన లక్ష్యంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరింతగా అవసరమని కూడా వారు హితవు పలికారు.

Blogger ఆధారితం.