-->

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు

 

మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు

హైదరాబాద్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగా సీతారాములు ఇటీవల గాంధీ భవన్‌లో తన నియామక పత్రాన్ని స్వీకరించిన అనంతరం రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు మరియు యువజన సేవల శాఖ మంత్రి వాకాటి శ్రీహరిలను వారి క్యాంప్ కార్యాలయాల్లో కలుసుకుని శుభాకాంక్షలు పొందారు.

ఈ సందర్భంగా మంత్రులు ఆయనను అభినందించి, పార్టీ నిబద్ధతకు ఆయన వహించిన పాత్రను ప్రశంసించారు. టీపీసీసీ కీలక పదవికి నాగా సీతారాములును నియమించడం ద్వారా పార్టీ యాక్టివిస్టులకు గౌరవం కలిగినట్లు వారు అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలను గుర్తించి, అధిష్టానం వారు హక్కుల స్థాయిలో భాగస్వాముల్ని చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వాన్ని అమలులో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి చేర్చేందుకు టీపీసీసీ నాయకత్వం బాధ్యతగా వ్యవహరించాలని మంత్రులు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలన్నారు.

నాగా సీతారాములు మాట్లాడుతూ, అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, రాష్ట్రంలోని కార్యకర్తల సమస్యలకు పోరాటం చేస్తూ, కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు హక్కులు, సంక్షేమ పథకాలు చేరేలా తాను శ్రమిస్తానని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.