💥 నార్సింగీ లో భారీగా డ్రగ్స్ పట్టివేత - 1.5 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
నార్సింగీ ప్రాంతంలో డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు చేపట్టిన ఆపరేషన్లో భారీ విజయాన్ని సాధించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నార్సింగీ ప్రాంతంలో మోటు వేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించగా అందులో 650 గ్రాముల గోదుమ రంగు హెరాయిన్ గుర్తించారు.
ఈ హెరాయిన్ మార్కెట్ విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్ను రాజస్థాన్ రాష్ట్రం నుండి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
అదుపులోకి తీసుకున్న వ్యక్తి ప్రాథమికంగా విచారించగా, తాను హెరాయిన్ను స్వయంగా ఉపయోగిస్తున్నట్లు మరియు తద్వారా మరికొంతమందికి అదే మాదక ద్రవ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అంగీకరించాడు.
ఈ కేసులో నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, ప్రస్తుతం నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెరాయిన్ను అతనికి విక్రయించిన వ్యక్తి కూడా గుర్తింపు లోపలికి వచ్చి, అతని కోసం ప్రత్యేక బృందాలు వేట మొదలుపెట్టినట్టు సమాచారం.
ఇటువంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పై పోలీసుల దృష్టి మరింత కట్టుదిట్టంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ ను నిరోధించేందుకు అందరూ సహకరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.

Post a Comment