తగ్గేదే లేదన్న కొండా దంపతులు – మీనాక్షి నటరాజన్ నివేదిక కీలకం
వరంగల్ కాంగ్రెస్లో ఏర్పడిన అంతర్గత సంక్షోభంపై కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఏమాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేరు. వారిని నియంత్రించేందుకు పార్టీ హైకమాండ్ తరఫున మధ్యవర్తిగా రంగంలోకి దిగిన ఎఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ కూడా వారిని మెత్తబడ్డించలేకపోయినట్లే కనిపిస్తోంది.
❖ అద్భుత నివేదిక.. పదహారు పేజీలు!
కొండా దంపతులు మీనాక్షిని కలిసి మాట్లాడిన అనంతరం, వరంగల్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలపై, వారి కార్యకలాపాలపై 16 పేజీల నివేదిక సమర్పించారు. ఇందులో కీలక నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
❖ “తగ్గేది లేదు” – స్పష్టమైన సంకేతాలు
మీడియాతో మాట్లాడిన కొండా మురళి,
“నేను బలహీనవర్గాల ప్రతినిధిని. ఎవరినీ భయపడను. రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సీఎం కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. మేం ప్రజల కోసమే పని చేస్తున్నాం. పని చేసే వాళ్లపై రాళ్లు వేస్తున్నారు” అన్నారు.
❖ ఆలయ కమిటీలు, పోస్టింగులపై విమర్శలు
- "మంత్రికి సంబంధం లేకుండా ఆలయ కమిటీలు వేస్తున్నారు."
- "మంత్రికి తెలియకుండా పోస్టింగులు ఇస్తున్నారు."అని విమర్శలు చేశారు.అలానే మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అక్రమ మైనింగ్ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
❖ కొండా సురేఖకు బాసటగా అమ్మ ప్రేమ
తన కుమార్తె పరకాల నుంచి రాజకీయాల్లోకి రావాలనుకోవడం సబబేనని, ఎవరి రాజకీయాలు వాళ్లవి అని కొండా సురేఖ సమర్థించారు.
❖ కాంగ్రెస్కు సేవే ధ్యేయం
- ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించే బాధ్యత తామే తీసుకుంటామని
- ఎమ్మెల్సీ అవకాశం రావకపోయినా నిరాశపడబోమని
- లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యమనికొండా మురళి స్పష్టం చేశారు.
❖ మీనాక్షి నటరాజన్ సమాలోచనలు ఫలించలేదా?
కొండా దంపతులు తమ స్థాయిని తగ్గించకుండా, ఇతర నేతలపై ఆరోపణలతోనే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Post a Comment