ఆదాయపు పన్ను చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: దేశంలో పన్ను వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ఆదాయపు పన్ను చట్టం–2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961 రద్దుకానుంది. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ వేదికలో తెలిపిన ప్రకారం, కొత్త చట్టం సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానంను తీసుకురానుంది.
ప్రధాన అంశాలు:
- 1961 చట్టంలోని 819 సెక్షన్లు → 536కు తగ్గింపు
- 47 అధ్యాయాలు → 23 అధ్యాయాలు
- 5.12 లక్షల పదాలు → 2.6 లక్షలకు తగ్గింపు
- 39 కొత్త పట్టికలు, 40 సూత్రాలు చేర్పు
- క్లిష్ట నిబంధనల తొలగింపు, భాషను సరళతరం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే పన్ను చెల్లింపుదారులకు లెక్కలు, లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి వర్గాలకు స్పష్టత పెరగనుంది.
➡️ దేశ ఆర్థిక చరిత్రలో కీలక మలుపు కానున్న ఈ చట్టం 2026–27 ఆర్థిక సంవత్సరంలో అమలులోకి రానుంది.
Post a Comment