సూర్యాపేటలో దారుణం – ముగ్గురిపై కారులో వెంబడించి హత్యాయత్నం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలు దారుణం. ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్ పై వెళ్తున్న ముగ్గురిని – ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు – కారులో వెంబడించిన ఐదుగురు దుండగులు బీబీ గూడెం సమీపంలోని ఓ వైన్స్ షాప్ వద్ద ఆపాలని ప్రయత్నించారు. బైక్ను బయటపడవేసిన బాధితులు భయంతో వైన్స్ షాప్ లోపలికి పరుగెత్తారు.
వారిని హతమార్చేందుకు కత్తులు, కర్రలతో దాడికి సిద్ధమైన దుండగులు లోపలికి దూసుకెళ్లబోతుండగా, వైన్స్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో ఆపదలోంచి బయటపడ్డారు. పరిస్థితి చూరగొట్టుకుందని గ్రహించిన దుండగులు వెంటనే కారెక్కి అక్కడి నుండి పారిపోయారు.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Post a Comment