20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
కరీంనగర్ జిల్లా, ఆగస్టు 29: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంబం నాగరాజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి సహాయం చేస్తానని నాగరాజు రూ.20,000/- లంచం డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి, అతన్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ACB ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అయినా లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరింది. అలాగే
- WhatsApp: 9440446106
- Facebook: Telangana ACB
- X (Twitter): @TelanganaACB
- Website: acb.telangana.gov.in
ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
🔒 ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అవినీతి నిరోధక శాఖ భరోసా ఇచ్చింది.
Post a Comment