తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరగనుంది. ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ వెంటనే 30నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మొదటి రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సభ సంతాపం ప్రకటించనుంది. ఆ తరువాత అసలు రాజకీయ చర్చలు మొదలుకానున్నాయి.
ఈ సమావేశాల్లోనే
- ఉపసభాపతి ఎంపిక
- కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ నివేదికపై చర్చ
లాంటివి ముఖ్యాంశాలుగా నిలవనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్పై వచ్చిన కమిషన్ నివేదికపై ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.
👉 రాబోయే ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా మారనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Post a Comment