వైద్య, విద్య రంగాలకు పెద్దపీట : మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా, రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని కాకతీయ కాలనీలో ఆధునికీకరించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి రేషన్ కార్డుల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ విద్యను పొందాలనే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తోంది” అని తెలిపారు. అలాగే మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించి పలు పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారి భాస్కర్, డీఈఓ యాదయ్య, తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment