-->

ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు – ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు – ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాళి


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 09: ప్రజాకవి, పద్మభూషణ్ డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సంస్కృతి, భాష, సాహిత్యానికి అపార సేవలందించిన కాళోజీని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. అందరూ కలిసి కాళోజీ చిత్రపటానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, “కాళోజీ నిజమైన ప్రజాకవి. ఆయన కవిత్వం, రచనలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన ఆలోచనలను మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవలో ముందుకు సాగాలి” అని అన్నారు.

కళాసాహిత్యాల ద్వారా సామాజిక చైతన్యం రగిలించిన కాళోజీని తరతరాల వారు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793