-->

తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు


హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

  • ఆసిఫాబాద్ ఏఎస్పీ ఎస్. చిత్తరంజన్‌ను అదే జిల్లాలో అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.
  • కామారెడ్డి ఏఎస్పీ బొక్కా చైతన్యరెడ్డిని సంగారెడ్డి అదనపు ఎస్పీగా బదిలీ చేశారు.
  • జనగామ ఏఎస్పీ పందిరి చేతన్ నితిన్‌ను జగిత్యాల ఏఎస్పీగా నియమించారు.
  • భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్‌ను మెదక్ ఏఎస్పీగా బదిలీ చేశారు.
  • వరంగల్ ఏఎస్పీ నగ్రాలె శుభమ్ ప్రకాశ్‌ను నిజామాబాద్ అదనపు డీసీపీగా నియమించారు.
  • భైంసా అదనపు ఎస్పీ రాజేశ్ మీనాను వనపర్తి ఏఎస్పీగా బదిలీ చేశారు.
  • ఆదిలాబాద్ ఏఎస్పీ పి. మౌనికను ఆదిలాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.
  • నిర్మల్ ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్‌ను భైంసా ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)గా బదిలీ చేశారు.
  • వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయిని ఉట్నూర్ ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)గా నియమించారు.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793