అంగన్వాడీ కేంద్రాలకు రూ.156 కోట్ల నిధుల విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సాయం అందించింది. పోషకాహార పథకం (ఎస్ఎన్పీ) కింద సరఫరా చేసిన సరుకుల బిల్లుల చెల్లింపుల నిమిత్తం ఆర్థిక శాఖ రూ.156 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో సరుకులు, కూరగాయలు, గ్యాస్ సరఫరా, అద్దెలు తదితర ఖర్చుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ తక్షణమే సమర్పించాలని శాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రాబోయే రెండ్రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా బిల్లులను అప్లోడ్ చేయాలని కూడా స్పష్టం చేసింది. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల కార్యకలాపాలు మరింత సజావుగా సాగనున్నాయని అధికారులు తెలిపారు.
Post a Comment