త్వరలో తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు డీజీపీ శివధర్ రెడ్డి కీలక శుభవార్త అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ఖాళీలకు సంబంధించిన సంపూర్ణ ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు
దీంతో ప్రతి ఏడాది కొత్తగా అర్హత సాధిస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా విడుదల చేయాలంటూ నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ప్రజా భద్రతకు ఊతం
ప్రత్యేకంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది కొరతను తగ్గించడంలో ఈ నియామకాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
అభ్యర్థుల్లో ఆశలు
అయితే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి స్పష్టమైన తేదీ ప్రకటించకపోవడంతో కొంత ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం త్వరితగతిన అనుమతి ఇచ్చి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే, కొత్త సంవత్సరంలో నిరుద్యోగ యువతకు ఇది నిజమైన శుభవార్తగా మారనుంది.

Post a Comment