-->

₹16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాండూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది

 

₹16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తాండూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది

వికారాబాద్ జిల్లా: ఫిర్యాదుదారునికి సంబంధించిన 11 ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటూ తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఇన్-చార్జ్ సబ్‌ రిజిస్ట్రార్ మరియు సిబ్బంది తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఫిర్యాదుదారునికి సంబంధించిన ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన 4 ప్లాట్ల దస్తావేజులు అందజేయడం, అలాగే మిగిలిన 7 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి వాటి దస్తావేజులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ముందస్తు ప్రణాళిక ప్రకారం ₹16,500 లంచం తీసుకుంటున్న సమయంలో నిందితులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిసర ప్రాంతంలో పట్టుకున్నారు.

ఈ కేసులో పట్టుబడిన వారు:

  • సాయి కుమార్ – ఇన్-చార్జ్ సబ్‌ రిజిస్ట్రార్ మరియు జూనియర్ అసిస్టెంట్
  • డి. సాయి కుమార్ – దస్తావేజు లేఖకుడు
  • డి. అశోక్ – సహాయక దస్తావేజు లేఖకుడు

నిందితులందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793