చారిత్రాత్మక ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి తరలి రావాలని పిలుపు
♦️ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా గ్రాండ్ ఓపెనింగ్
♦️ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం: కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ ప్రాంతంలో నూతనంగా స్థాపించబడుతున్న చారిత్రాత్మక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డిసెంబర్ 2న ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ యూనివర్సిటీ స్థాపన కొత్తగూడెం జిల్లాకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ముఖ్య అథితులు
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి
- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
- మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్
- ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
అన్ని ఏర్పాట్లు పూర్తి
ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయేందుకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Post a Comment