నకిలీ ఏసీబీ అధికారుల అరెస్ట్ ఏసిబి డీఎస్పీ అధికారి ముసుగులో ప్రభుత్వ అధికారులను బెదిరించి, వసూళ్లు
నకిలీ ఏసీబీ అధికారుల అరెస్ట్ – వరంగల్లో కలకలం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో, తాము ఏసీబీ డీఎస్పీలు అని చెప్పుకుంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
నిందితుల వద్ద నుండి ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సంఘటన ప్రభుత్వ అధికారుల్లో తీవ్ర ఆందోళనకు, కలకలానికి కారణమైంది.

Post a Comment